వాహనదార్లపై మరోమారు పెట్రోల్, డీజీల్ ధరల ప్రభావం తప్పదా అన్నట్లు మరోసారి పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలావుంటే దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ ధర ఈరోజు కూడా నిలకడగానే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో పయనిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. పైపైకి కదిలాయి. క్రూడ్ ధరలు ఏకంగా 2 శాతానికి పైగా పెరిగాయి. దీంతో వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఒకేసారి 2 శాతానికి పైగా పైకి కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు 2.13 శాతం మేర పెరిగింది. దీంతో ఈ క్రూడ్ రేటు బ్యారెల్కు 104 డాలర్లకు చేరింది. అదేసమయంలో డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ రేటు 1.95 శాతం పెరిగింది. దీంతో ఈ క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్కు 98.3 డాలర్లకు చేరింది. క్రూడ్ ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పైకి చేరే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్లో జూలై 30న పెట్రోల్ రేటు నిలకడగానే ఉంది. పెట్రోల్ రేటు లీటరుకు రూ. 109.64 వద్ద ఉంది. డీజిల్ రేటు రూ. 97.8 వద్ద కొనసాగుతోంది. వరంగల్లో అయితే పెట్రోల్ రేటు రూ. 109.14 వద్ద ఉంది. డీజిల్ రేటు రూ. 97.33 వద్ద కొనసాగుతోంది. కర్నూల్లో పెట్రోల్ రేటు రూ. 112.1 వద్ద ఉంది. డీజిల ధర అయితే రూ. 99.83 వద్ద కొనసాగుతోంది. గుంటూరులో అయితే పెట్రోల్ రేటు రూ. 111.74 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ రేటు రూ. 99.49 వద్ద కొనసాగుతోంది. వైజాగ్లో పెట్రోల్ రేటు రూ. 110.46 వద్ద ఉంది. డీజిల్ రేటు రూ. 98.25 వద్ద కొనసాగుతోంది.
ఇదిలావుంటే సమీప కాలంలో పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంచబోమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో వ్యాట్ తక్కువగా ఉందని తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రజలను పరిగణలోకి తీసుకొని పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంచకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఆదాయం పెంచుకోవడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని ట్యాక్స్ అధికారులను ఆదేశించారు. జోనల్ స్థాయి నుంచి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa