ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి వాతావరణ సమాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 10:26 AM

ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిందింది. రాయలసీమ, కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా రానున్న 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన మేఘాలు విస్తరించాయని, ముఖ్యంగా అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.34 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.30 గంటలకు కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa