ఏపీలోని కృష్ణా జిల్లా పెడన పరిధి కృష్ణాపురంలో దారుణం వెలుగు చూసింది. వీరబాబు, కొండాలమ్మ దంపతులకు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. అత్త రజనీకుమారి (55)తో కొండాలమ్మ తరచూ గొడవ పడేది. జులై 27న కర్రతో అత్త తలపై ఆమె బలంగా కొట్టింది. కాలుజారి పడిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు రజనీని ఆసుపత్రిలో చేర్చారు. జులై 30న ఆమె మృతి చెందింది. పోస్టుమార్టంలో హత్యగా తేలడంతో కొండాలమ్మను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa