కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ మంగళవారం బెంగళూరులోని ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధుల ఇంటికి వెళ్లి వారిని సన్మానించారు.దేవాదాయ శాఖ మంత్రి ఆర్ అశోక్, ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ కూడా పాల్గొన్నారు.అంతకుముందు జెపి నగర్ 4వ ఫేజ్లో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడు ఆర్ నారాయణప్ప ఇంటికి గవర్నర్ వెళ్లి సన్మానించారు.అనంతరం బనశంకరి 3వ స్టేజీలోని స్వాతంత్య్ర సమరయోధుడు శంకరనారాయణరావు ఇంటికి వెళ్లి జ్ఞాపికతో సత్కరించి మిఠాయిలు అందించారు.ఆ తర్వాత మల్లేశ్వరంలోని నాగభూషణరావు ఇంటికి గవర్నర్ వెళ్లి సన్మానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa