ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల భాగస్వామ్యంతో స్మార్ట్ సిటీలు ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 11, 2022, 12:07 PM

రైతుల భాగస్వామ్యంతో మండలంలోని చోడపల్లి, భోగాపురం గ్రామాల్లో స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ తెలిపారు. చోడపల్లి గ్రామ సచివాలయ ఆవరణలో జగనన్న స్మార్ట్ సిటీలపై సమావేశం నిర్వహించారు. చోడేపల్లిలో 31 ఎకరాలు, భోగాపురంలో 30 ఎకరాల భూమిని జగనన్న స్మార్ట్ సిటీలగా అభివద్ధి చేయడానికి ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎకరా విస్తీర్ణంలో 18 సెంట్లు భూమిని సంబంధిత రైతుకు కేటాయిస్తామని, పట్టా మంజూరు చేస్తామని తెలిపారు. స్మార్ట్ సిటీలకు ఎంపిక చేసిన భూములలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. దీనికి రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాంబాబు, ఎంపీటీసీ లాలం శ్రీనివాసరావు, తహశీల్దారు శ్రీనివాసరావు, వైసీపీ మండల నాయకులు గండిబోయిన వెంకట్ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa