ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంకా ఈ రోడ్లపై ఎంతమంది బలవ్వాలి ....?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 13, 2022, 04:23 PM

రోడ్డుపై గుంత కారణంగా మనిషి చనిపోయేంత వరకు నిద్రపోతున్న ప్రభుత్వం,ఆ తర్వాతైనా మేలుకోక పోవడం దురదృష్టకరం అని టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. వివరాల్లోకి వెళ్ళితే  ఈ నెల 4వ తారీఖున విశాఖపట్నంకు చెందిన రవ్వా సుబ్బారావు రోడ్ ప్రమాదానికి గురవగా , దానిపై స్పందిస్తూ.... రోడ్డుపై గుంత కారణంగా మరణించారు. తిరిగి అదే గుంత వద్ద 6వ తేదీన మళ్ళీ ప్రమాదం జరిగి మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు.


అయినా ప్రభుత్వానికి స్పృహ రాలేదు. చివరికి తమకు కలిగిన బాధ మరెవరికీ కలగకూడదని సుబ్బారావు కుటుంబసభ్యులే గుంతను పూడ్చారు. ఈ నేతలకు అధికారమిచ్చి, పన్నుల రూపంలో వీళ్ళ చేతికి డబ్బులిచ్చి, చివరికి వాళ్ళు చేయాల్సిన పనిని కూడా మనమే చేసుకోవాల్సి రావడం బాధాకరం అని విచారం వ్యక్తపరిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa