ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా కారణంగా తాజాగా 41 మంది మరణం...కేరళలోనే ఎక్కువ

national |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 03:24 PM

దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య కాస్త  పెరిగింది. ఆ మరణాల రేటు కూడా ఎక్కువగా కేరళలోనే నమోదవుతోంది. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయ సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 14,092 కొత్త కేసులురాగా.. 41 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ప్రకటించింది. ప్రస్తుతానికి కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని.. కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని పేర్కొంది. గత 24 గంటల్లో 3,81,861 కరోనా టెస్టులు చేయగా.. 14,092 మందికి పాజిటివ్ గా తేలిందని వెల్లడించింది.


మొత్తం 41 మంది కరోనాతో మరణించగా.. అందులో ఒక్క కేరళ నుంచే 12 మరణాలు నమోదైనట్టు తెలిపింది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,27,037కు చేరిందని వివరించింది. మొత్తంగా ఇప్పటివరకు దేశంలో 4.42 కోట్ల కరోనా కేసులు నమోదుకాగా.. 4.36 కోట్ల మంది (98.54%) కోలుకున్నారని తెలిపింది. క్రియాశీల కేసుల సంఖ్య 1,16,861 (0.26%)గా ఉన్నట్టు ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విస్తృతంగా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa