ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో ప్రారంభమైన అగ్నివీర్ నియామకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 14, 2022, 07:46 PM

విశాఖపట్నంలో అధివారంనాడు అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ విధానానికి పెద్ద ఎత్తు విమర్శలు, తీవ్ర ఆందోళనలు చెలరేగినా.. మోదీ సర్కారు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఆదివారం ఉదయం నుంచి ర్యాలీ మొదలైంది. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.


ఆదివారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. ర్యాలీలో సందర్భంగా స్టేడియంలో 24 గంటల పాటు విద్యుత్‌, నీటి సరఫరా సదుపాయం కల్పించారు. అలాగే రన్నింగ్‌ ట్రాక్‌పై నీరు, బురద లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ మల్లిఖార్జున కోరారు.


ఇదిలావుంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అగ్నివీర్ విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అలాగే, యువత తీవ్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో యువత చేసిన విధ్వంసం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అగ్నివీర్‌ల ఎంపిక ప్రారంభం కావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa