భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు ఈ నెల 13, 14, 15 తేదీలలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని సుండుపల్లెలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు కళ్ళే రెడ్డెప్ప మండల టీడీపి నేతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేసి మువ్వన్నెల జాతీయ జెండాకు వందనం చేసి దేశభక్తిని చాటాకున్నారు.
అనంతరం పార్టీ కార్యాలయం నుండి బస్ స్టాండ్ కూడలి వరకు ర్యాలీగా వెళ్ళి మానవహారం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్రం అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa