విశాఖపట్నం: మర్రిపాలెం బి.ఆర్.టి.ఎస్ రహదారి కి ఇరువైపులా ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న తోపుడుబండ్ల తో పాటుగా పాదచారులు వినియోగించాల్సిన నడకదారి పై ఆక్రమణలను కంచరపాలెం ట్రాఫీక్ సీఐ కృష్ణ రావు నేతృత్వంలో ఎస్. ఐ మనోజ్ కుమార్ శుక్రవారం సిబ్బందితో తొలగించారు. ఈ సందర్భంగా ఎస్. ఐ మనోజ్ కుమార్ మాట్లాడుతూ మర్రిపాలెం బి. ఆర్. టి. ఎస్ రహదారికి ఇరువైపులా ప్రమాదాలు నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని అందులో భాగంగా రహదారులు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న తోపుడు బళ్లను, పాదచారులు వినియోగించాల్సిన నడకదారి పై ఆక్రమణలను తొలగించమని తెలిపారు.
వ్యాపారస్థులకు, తోపుడు బండి నిర్వాహకులకు రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. ఇకపై రహదారులు ఆక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రహదారి నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa