ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు సిద్ధవటం గ్రామంలో పవన్ కల్యాణ్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇదిలావుంటే ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశంతో కౌలు రైతుల భరోసా యాత్రకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రేపు (శనివారం) పవన్ కల్యాణ్ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని సిద్ధవటం గ్రామంలో పవన్ కల్యాణ్ రచ్చబండ పేరిట రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రచ్చబండలోనే ఆయన పలువురు రైతుల కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున సహాయం అందించనున్నారు. జిల్లా పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలన్నింటికీ పవన్ ఈ సాయాన్ని చేరవేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa