పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి బకాయిలూ లేదని ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. విద్యుత్ క్రయ విక్రయాల నిషేధిత జాబితాలో ఏపీని చేర్చారని సమాచారం లోపం వల్లేనని చెప్పారని.. విద్యుత్ క్రయవిక్రయాల విషయంలో కేంద్రం విధించిన నిషేధం ఏపీకి వర్తించదు అన్నారు.
కేంద్రం విద్యుత్ పంపిణీ సంస్థలకు ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం సంగతి తెలిసిందే. కేంద్ర ఇంధన శాఖ 2022 జూన్ నుంచి లేట్ పేమెంట్ సర్ఛార్జి నిబంధనలను అమల్లోకి తెచ్చింది. విద్యుదుత్పత్తి సంస్థలకు బిల్లులను నిర్దేశిత వ్యవధిలో చెల్లించాలి.. లేని పక్షంలో బకాయిలు ఉంటే విద్యుత్ ఎక్స్ఛేంజీల్లో లావాదేవీలపై కేంద్రం నిషేధం విధించింది. తెలంగాణ రూ.1,600 కోట్లు, ఏపీ రూ.350 కోట్లు బకాయిలున్నాయని.. అందుకే నిషేధించారని ప్రచారం జరిగింది.
దీనిపై ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వివరణ ఇచ్చారు. ఏపీ డిస్కమ్లు చెల్లించాల్సిన రూ.350 కోట్లు ఇప్పటికే చెల్లించేరని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లడంతో ఆ జాబితా నుంచి ఏపీ పేరు తొలగించారని తెలిపారు. మొత్తం 13 రాష్ట్రాల డిస్కంలు ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించింది. విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొన్న కరెంటుకు నిర్దేశిత వ్యవధిలో బిల్లులు చెల్లించలేదన్న కారణంతో చర్యలు తీసుకుంది. కేంద్రం నిషేధించిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపుర్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ-కశ్మీర్, బిహార్, ఝార్ఖండ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల డిస్కంలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల పేర్లు కూడా ఉన్నాయని చెప్పగా.. ఏపీ ఇందన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa