ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయిబాబాపై మాధవీలత మరోసారి సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 03, 2026, 10:52 AM

సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందన్న కారణంతో నటి మాధవీలతపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆమె అలాంటి వ్యాఖ్యలు చేశారు. సాయిబాబాను ఆరాధించేవారు హిందువులేనని, అయితే వారు పూర్తి స్థాయిలో హిందువులుగా మారడానికి సాయిబాబాను విడిచిపెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. తెలుగువారికి మహిమలు కలిగిన గురువులు ఎంతోమంది ఉన్నారని, వీరబ్రహ్మేంద్రస్వామి, రాఘవేంద్రస్వామి వంటి వారిని ఆరాధించాలని సూచించారు. హిందువులు అల్లాను ఆరాధించే సాయిబాబాను పూజించవద్దని, రామాయణం, మహాభారతం చదువుకోవాలని ఆమె అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa