ఉదయ్ కిరణ్, రీమాసేన్, తనూరాయ్ నటించిన 'మనసంతా నువ్వే' సినిమా ప్రేమికుల రోజున, అంటే ఈ నెల 14న, తిరిగి థియేటర్లలో విడుదల కానుంది. 25 ఏళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఎం.ఎస్. రాజు నిర్మించారు. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి, శ్రీ మాత క్రియేషన్స్ రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి రీ రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో 250 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సినిమా, ఇప్పటి యువతను కూడా ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు.2001 లో విడుదలై ఘనవిజయం అందుకున్న ఈ సినిమా (Movie) ఇప్పటికీ 90స్ కిడ్స్ కి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఈ సినిమాను ఇష్టపడని ప్రేక్షకుడు దాదాపు లేరనే చెప్పాలి. ఉదయ్ కిరణ్ హీరోగా, రీమాసేన్, తనూ రాయ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో ప్రేమ, భావోద్వేగం, త్యాగం వంటి అంశాలను చాలా చక్కగా ఆవిష్కరించిన దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో భారీ సంచలనం సృష్టించి ఊహించని కలెక్షన్లను కూడా రాబట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa