సావిత్రి బాటలో నిత్యా మీనన్ నడవటం ఏంటి అనుకుంటున్నారా.. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యా పేరుకు మళయాల ముద్దుగుమ్మ అయినా కూడా తెలుగులోనూ మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. అలా మొదలైంది సినిమాతో మొదలు పెట్టి ఇక్కడ కూడా చాలా సినిమాల్లో నటించింది. ఈ మధ్యే విజయ్ దేవరకొండ గీత గోవిందం.. ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాలు కూడా చేసింది ఈమె. ఇదిలా ఉంటే ఈ మధ్య అసలు తెలుగు ఇండస్ట్రీ వైపు చూడటమే మానేసింది నిత్యా. ఆ మధ్య సావిత్రి బయోపిక్లో నటించాలనుకున్నా కూడా మహానటి ఆఫర్ కాస్తా కీర్తి సురేష్ తీసుకెళ్లిపోయింది. ప్రస్తుతం ఈమె తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథలో నటిస్తుంది. దీని పేరు ది ఐరన్ లేడీ.. ఇందులో జయలిలత పాత్రలో నటిస్తుంది నిత్యా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ చిత్రంపై తమిళనాట ఓ ప్రముఖ పత్రిక ఆర్టికల్ రాసింది. అందులో నిత్యా మీనన్ పేరు ముందు శ్రీమతి అని ప్రచురించింది. పెళ్లికి ముందు అయితే కుమారి అని రాస్తారు కానీ.. నిత్యాకు మాత్రం శ్రీమతి అని రాసారు. దాంతో ఆమెకు పెళ్లైపోయిందనే ప్రచారం మొదలైంది. కావాలనే రాసారా లేదంటే అనుకోకుండా అలా జరిగిందా అనేది ఇప్పుడు అర్థం కావడం లేదు. లేదంటే నిజంగానే పెళ్లైనా కూడా నిత్యా మీనన్ ఈ విషయాన్ని దాచేసిందా అనేది కూడా అర్థం కావట్లేదు అభిమానులకు. గతంలో సావిత్రి కూడా ఇలాగే సీక్రేట్ మ్యారేజ్ చేసుకుంది. పెళ్లైన ఆరేళ్ళ తర్వాత కానీ జెమినీతో ఏడడుగులు నడిచిన విషయాన్ని బయటికి చెప్పలేదు సావిత్రి. ఇప్పుడు నిత్యా మీనన్ కూడా ఇదే చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ శ్రీమతి నిత్యా మీనన్ వెనక ఉన్న కథేంటో తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు. మరి దీనికి సమాధానం నిత్యా ఇస్తుంది లేదా అనేది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa