పట్టువదలని విక్రమార్కుడిగా వర్మ అనుకున్నది సాధించాడు. ఎట్టకేలకు తన వివాదాస్పద చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు థియేటర్స్ లోకి తీసుకువచ్చాడు. కళ్లముంది నిజ పాత్రలే కనిపిస్తున్నాయా అనిపించేలా సినిమాని తొలి భాగం తీర్చి దిద్దినా రెండో భాగంలో పట్టు బిగువ తగ్గటంతో చతికిల్లబడింది. అయితే కొన్ని సన్నివేశాలు టీడీపీ, జనసేన పార్టీల వారిని విపరీతమైన ఆగ్రహానికి గురిచేశాయనటంలో సందేహం లేదు. ఈ చిత్రంలో జగన్ని హీరోగా బాబు ని కరుడుగట్టిన విలన్ గా , లోకేష్, పవన్, కెఏ పాల్ పాత్రలను వ్యంగ్యంగా రూపొందించి, కామెడీకి వాడుకోవటంతో వారిని అభిమానించే వారు జీర్ణించుకోలేనంతగా చూపించారన్నదీ వాస్తవం.
వర్మ వ్యవహారానికి చిర్రెత్తిన కొందరు తమదైన శైలిలో నిరసన చెప్పడం సంచలనంగా మారింది. వర్శకు శ్రద్ధాంజలి బ్యానర్ ఏర్పాటు చేయడంతో పాటు ఒకింత పరుష పదాలతో ఆయను తిట్టడం జరిగింది. ఈ సంఘటనపై వర్మ స్పందించారు. సదరు బ్యానర్ ని పోస్ట్ చేయడంతో పాటు, బాబు, లోకేష్, పవన్ వీరాభిమానులు సినిమా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేయడం ఆపి, ఆ మూవీని అర్థం చేసుకోవాలన్నారు. సదరు అభిమానులపై ప్రమాణం చేస్తూ ఎవరిని కించపరచడానికి నేను ఆ సినిమా చేయలేదని, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీశానని చెప్పుకొచ్చారు.
అయితే నువ్వ బ్యాడ్ సినిమా తీసి, చంద్రబాబు, లోకేష్, పవన్, పాల్ల ఫోటోలు వాడుకుని ఇష్టాను సారం పోస్టులు చేస్తే లేనిది. మేం కూడా మా ఎంటర్టైన్ మెంటు కోసమే బ్యానర్లు కడితే వచ్చిందా? ఇందులో తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పలేక పోతున్నాడట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa