ప్రముఖ సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి 8.50ని.ల సమయంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన గుండెకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకి గుండెపోటు రావడంతో బెంగళూరులో ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కందేపి మృతికి తెలుగు, తమిళ పరిశ్రమలకి సంబంధించిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్యనారాయణ 'పాండురంగ మహత్యం' అనే తొలి డబ్బింగ్ సినిమా రూపొందించారు. ఆ తర్వాత కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయామోహిని, దొరగారింట్లో దొంగోడు వంటి చిత్రాలని నిర్మించారు. మొత్తం 40 చిత్రాలకు పైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa