ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో బయటపడుతున్న నిజాలు..

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 16, 2020, 12:46 PM

నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను పోలీసులు విచారించారు. రిమాండ్ రిపోర్టులో ఏ1గా దేవరాజ్ రెడ్డి,ఏ2గా సాయికృష్ణారెడ్డి,ఏ3గా అశోక్ రెడ్డిని పోలీసులు చేర్చారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ప్రాథమికంగా తేలింది. 2012లో శ్రావణి సినిమాలల్లో నటించేందుకు హైదరాబాద్ వచ్చింది. అప్పుడు ఆమెకు ముందుగా సాయికృష్ణారెడ్డి పరిచయమయ్యాడు. అతనితో ఏర్పడిన బంధంతో శ్రావణి రిలేషన్ షిప్ కొనసాగించింది. ఆ తర్వాత సినిమాలల్లో అవకాశాల పేరుతో 2015లో శ్రావణికి నిర్మాత అశోక్ రెడ్డి పరిచయమయ్యాడు. అతనితో కూడా శ్రావణి రిలేషన్ షిప్ కొనసాగించింది.
2019లో దేవరాజ్ రెడ్డి టిక్ టాక్ లో పరిచయమయ్యాడు. అతనిని శ్రావణి ప్రేమించింది. శ్రావణి తన కుటుంబ సభ్యుల ముందే దేవరాజ్ కు ప్రపోజ్ చేసింది. సాయి,అశోక్ రెడ్డిలతో శ్రావణి రిలేషన్ షిప్ విషయం తెలిసి దేవరాజ్ శ్రావణిని పెళ్లి చేసుకోనన్నాడు. సెప్టెంబర్ 7న అజీజ్ నగర్ లో షూటింగ్ స్పాట్ లో ఉన్న శ్రావణిని దేవరాజ్ తీసుకెళ్లాడు. ఆ రోజు రాత్రి సుకన్య హోటల్ కు వెళ్లారు. అక్కడికి సాయికృష్ణ చేరుకొని శ్రావణిని కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. ఓ వైపు పెళ్లి చేసుకోవాలని సాయి వేధింపులు, మరోవైపు తనతో ఉండాలని అశోక్ బెదిరింపులు ఇంకో వైపు ప్రేమించిన వాడు వద్దనడంతో శ్రావణి తట్టుకోలేకపోయింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. నటి శ్రావణి కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa