ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ 'సర్కారు వారి పాట' మూవీ కొత్త అప్డేట్..

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 29, 2021, 05:29 PM

కరోనా వైరస్ దెబ్బతో సినీ ఇండస్ట్రీ అంతా అతలాకుతలం అయ్యింది. మూవీ షూటింగ్స్ లేకపోవడంతో పరిశ్రమ కుదేలైంది. అయితే కరోనా ఉధృతి తగ్గడంతో తిరిగి సినీ పరిశ్రమ పుంజుకుంటుంది. శరవేగంగా షూటింగులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అగ్రహీరోలు తమ సినిమాల విడుదల తేదీని ప్రకటిస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మహేశ్‌బాబు కూడా వచ్చి చేరారు.
మహేశ్ బాబు హీరోగా పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సర్కారువారి పాట' మూవీకి సంబంధించి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. 'సర్కారువారి పాట' చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తాళాల గుత్తి పట్టుకున్న మహేశ్‌ చేతి పోస్టర్‌ను విడుదల చేశారు. ''సూపర్‌స్టార్‌' సంక్రాంతి మరోసారి రానుంది.
'సర్కారువారి పాట'ను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్రబృందం ట్వీట్ చేసింది. ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమైన చిత్రీకరణ ఇటీవల దుబాయ్‌లో ప్రారంభమైంది. మైత్రీమూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. గతేడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో మహేశ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. రాబోయే సంక్రాంతికి సర్కారు వారి పాట రిలీజ్ కాబోతుందని ప్రకటించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa