మెగాస్టార్ చిరంజీవికి అశేష అభిమాన గణం ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలకు ఆయన నటనకు, డాన్స్లకు, డైలాగ్ లకు బారీ క్రేజ్ ఉంది. ఇక ఇటీవలే సినిమాలకు రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు చిరు. ఇపటికే ఆచార్య సినిమా షూటింగ్ క్లైమాక్స్కు చేరుకుంది. అలాగే లూసిఫర్ రీమేక్ పనులు కుడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే..మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగష్టు 22 సందర్భంగా "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరిత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. అందుకు, యంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం "గ్రీన్ ఇండియా ఛాలెంజ్"లో మీరంత పాల్గొనాలి, మూడు మొక్కలు నాటి, నాకు ట్విట్టర్లో ట్యాగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు చిరు.
చిరు ట్వీట్ పై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ మెగాస్టార్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై మెగాస్టార్కి ఉన్న ప్రేమను తెలియజేస్తున్నదని, ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు. "గ్రీన్ ఇండియా ఛాలెంజ్"లో పాల్గొనే ప్రతీ అభిమాని చిరుకు ట్యాగ్ చేయాలని సంతోష్ కుమార్ సూచించారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలిచిన మెగాస్టార్ ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులను అలరించాలని ఆయన ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa