ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ లో మరో విషాదం బాధలో ప్రముఖ ఫామిలీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 04, 2022, 03:29 PM

ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు పందిళ్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి (86) చెన్నైలో ఉదయం 8.30 గంటలకు కన్నుమూశారు.  తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులు ఎన్టీ రామారావు (ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్), కృష్ణ, శోభన్ బాబు వంటి వారితో 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. చంద్ర శేఖర్ రెడ్డి తన చాలా సినిమాలు సూపర్ స్టార్ కృష్ణతో  కూడా చేసాడు. బడి పంతులు, భలే అల్లుడు, మానవుడు దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు, విచిత్ర దాంపత్యం, రగిలే గుండెలు, నవోదయం, పాడి పంటలు, బంగారు కాపురం, రాజకీయ చదరంగం, అన్న వదిన, పెద్దలు మారాలి, పట్నవాసం, అన్న చెల్లు లాంటి  మంచి సినిమాలో  చాలా ఉన్నాయి. ఆయన చివరి చిత్రం 2014లో విడుదలైన జగన్నాయకుడు.1933 అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రంలో జన్మించిన పి చంద్రశేఖర్ రెడ్డి  1959లో సహాయ దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆదుర్తి సుబ్బారావు, మధుసూదనరావు వంటి ప్రముఖ దర్శకులకు కూడా సహాయ సహకారాలు అందించారు. అనురాధ అనే తెలుగు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. పందిళ్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి మృతి పట్ల తెలుగుసినిమా వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa