ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక సైకో కిల్లర్‌ను క్రైమ్‌ థ్రిలర్‌ గా తెరకెక్కిన చిత్రం ఓదేల రైల్వే స్టేషన్‌ ఆహాలో విడుదలకానుంది .

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 04:39 PM

లక్ష్మి రాధామోహన్ ప్రెజెంట్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ లో నిర్వమించారు సంపత్ నంది దర్శకత్వంలో నిర్మాత  కేకే రాధామోహన్ తెరకెక్కిన చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ ఈ సినిమా ఒక  జీవిత సంఘటనల ఆధారంగా. 2002లో ఓదెల అనే గ్రామంలో జరిగిన వరుస హత్యలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించి ఈ క్రైమ్‌ థ్రిలర్‌ ‘ఆహా’ ఓటీటీ వేదికగా 26వ తేదీన శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. కొత్తగా పెళ్లై, శోభనం జరిగిన మహిళలను మాటు వేసి హతమార్చిన ఓ సైకో కిల్లర్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక నిమిషం 47 సెకన్ల వ్యవధి ఉన్న ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నవ వధువులను అత్యాచారం చేసిన హతమార్చుతున్న సైకో కిల్లర్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అన్న సన్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. హెబ్బా పటేల్‌, పూజిత పొన్నాడ, వశిష్ట, సాయి రోనక్‌ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించాడు. ట్రైలర్‌ను గమనిస్తే సినిమా సహతత్వానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంపత్‌ నంది కథ అందించగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించడం విశేషం. కొత్తగా పెళ్లైన మహిళలను హత్య చేస్తోన్న సైకో కిల్లర్‌ను పోలీసులు ఎలా పట్టుకున్నారా.? అసలు ఆ కిల్లర్‌ హత్యలు ఎందుకు చేశాడన్న వివరాలు తెలియాలంటే ఆహాలో విడుదలవుతోన్న సినిమాను చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa