అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ కి మాత్రమే పరిమితమైన విజయ్, తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమాతో ఫామిలీ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఆ సినిమా ఏకంగా 100 కోట్లు సాధించి విజయ్ ని స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. తాజాగా గీతా గోవిందం సినిమా ఇంకో కొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ మధ్య జీ తెలుగులో ప్రసారం అయిన ఆ సినిమాకు ఏకంగా 20.7 టీవీ వ్యూయర్షిప్ రేటింగ్ వచ్చింది. ఇదేమి ఆషామాషీ రేటింగ్ కాదు, రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ మూవీ రంగస్థలం కంటే ఎక్కువ. రంగస్థలం సినిమాను స్టార్ మా వారు ప్రసారం చేయగా ఆ సినిమాకు 19.5 TRP వచ్చింది. బాహుబలి తర్వాత అంతటి హయ్యెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమా కంటే ఎక్కువ TRP వచ్చిందంటే దేవరకొండ క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని అందరి దృష్టిని తనవైపే తిప్పుకుంటున్నాడు విజయ్.చూస్తుండగానే విజయ్ దేవరకొండ సంచలన హీరో అయిపోయాడు. ఓవర్నైట్ స్టార్ అయ్యి సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలతో విజయ్ దేవరకొండకు యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. గీత గోవిందంతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత నోటా మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఆ మూవీ నిరాశ పరిచింది. విజయ్ ఈ ఏడాది మూడోసారి టాక్సీవాలాగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన టాక్సీవాలా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాపీసు వద్ద ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమైంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తున్నట్టు సమాచారం. ఈ జోరు చూస్తుంటే ఈ సినిమా ఈజీగా వంద కోట్లు కొట్టడం ఖాయంగా కనిపిస్తుందని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa