రాహు ఫేమ్ అభిరాం వర్మ నటిస్తున్న కొత్త చిత్రం "నీతో". ఈ సినిమాకు బాలు శర్మ దర్శకుడు కాగా సాత్వికా రాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.
వివాహానికి ఇన్సూరెన్స్ అనే విభిన్న కధాంశంతో, మోడరన్ డేస్ లో జరిగే ఒక కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ మూవీ, ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చెయ్యగలిగింది.
మిలియన్ డ్రీమ్స్, పృథ్వి క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లపై AVR స్వామి, కీర్తన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 14న థియేటర్లలో విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'అందరాని ప్రేమ నీదా' అనే ఎమోషనల్ లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాటను గౌతమ్ భరద్వాజ్ ఆలపించగా, శ్రీనివాస మౌళి లిరిక్స్ అందించారు.