మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవిగారి పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ "గాడ్ ఫాదర్" రేపే థియేటర్లకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ చిత్రబృందం కలిసి ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మోహన్ రాజా మాట్లాడుతూ... లూసిఫర్ లో లేని న్యూ అండ్ ఫ్రెష్ స్క్రీన్ ప్లే ను ఈ సినిమా కోసం రూపొందించాం... అలానే ఒరిజినల్ ఫిలిం లో లేని పది సర్ప్రైజ్ లను గాడ్ ఫాదర్ లో ప్లాన్ చేసాం... అంతేకాక ఇంటర్వెల్ బ్యాంగ్ కి థియేటర్ గోడలు బద్దలు కావడం ఖాయం...అని చెప్పుకొచ్చారు.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, నయనతార, సత్యదేవ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు.