తమిళనాడు ఎన్నికలకు ముందు దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్. అయితే ఈ మూవీ సెన్సార్ సమస్యల కారణంగా విడుదలకు ముందే వాయిదా పడింది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పడిన అడ్డంకుల వల్ల ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది.దీంతో ఈ సినిమా ఎన్నికలకు ముందు ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఈ చిత్రంలో విజయ్కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. అలాగే మమితా బైజు, ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించింది.ఇక సినిమా విషయాన్ని పక్కన పెడితే, తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు బుట్టబొమ్మ విజయ్ వైపు చూపించినట్లు అందులో కనిపిస్తోంది. ఈ వీడియో జన నాయగన్ షూటింగ్ సమయంలో తీసినదిగా సమాచారం.వీడియోలో విజయ్ కొంచెం సిగ్గుపడుతూ కనిపించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట హల్చల్ చేస్తుండగా, నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. “విజయ్ గెలుస్తాడని బుట్టబొమ్మకు ముందే తెలుసా?” అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు పూజా హెగ్డే కాన్ఫిడెన్స్ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa