తెలుగు చిత్రసీమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో శర్వానంద్ ఒకరు. తాజాగా ఇప్పుడు ఈ స్టార్ హీరో యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో కలిసి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, లండన్ మరియు హైదరాబాద్లో ఎక్కువ భాగం చిత్రీకరించబడిన ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్లో శర్వా తన భాగాన్ని పూర్తి చేసినట్లు సమాచారం.
కృతి శెట్టి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు 'మనమే' అనే టైటిల్ ని కూడా పెట్టినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa