రక్షిత్ శెట్టి మరియు రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం సప్త సాగరదాచే ఎల్లో – పార్ట్ ఎ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ తెలుగు ప్రేక్షకుల కోసం విడుదల చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలుగు వెర్షన్కి సప్త సాగరాలు దాటి – పార్ట్ ఎ అనే టైటిల్ను పెట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమా సెప్టెంబర్ 22, 2023న తెలుగు ప్రేక్షకుల ముందికి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో చైత్ర జె ఆచార్, అచ్యుత్ కుమార్ మరియు పవిత్ర లోకేష్ మరియు ఇతరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రక్షిత్ శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చరణ్ రాజ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa