ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్లు కొన్ని ప్రాంతాలలో తెరవబడ్డాయి మరియు తాజా అప్డేట్ ప్రకారం, నైజాం రీజియన్లో బుకింగ్లు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి అని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో విడుదల చేస్తున్నారు. అలాగే విడుదలైన మొదటి వారంలో నైజాం రీజియన్లో ఆరు షోలు వేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa