గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘రోబో’ సినిమాకు సీక్వెల్గా రోబో ‘2.0’ను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే.అయితే సుమారు రూ. 350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తోన్న ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని చిత్ర నిర్మాతలు భారీగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ నెల 27న దుబాయ్లో పాటల పండగను వైభవంగా జరపనున్నారు. వేడుకను వివిధ ప్రత్యేకతలతో రూపొందించినట్టు సమాచారం. భారతీయ సినీ చరిత్రలో అత్యంత వైభవంగా జరిగే ఈవెంట్గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
ఈ వేడుకను ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్ హోటల్ బుర్జ్ దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఈ నెల 26న రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్, ఏఆర్ రెహ్మాన్, శంకర్ లు బస చేసిన హోటల్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరి బుర్జ్ దుబాయ్ కి చేరుకుంటారు.
ఆ రోజు అంతర్జాతీయ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు జరుగుతున్న కార్యక్రమాల హైలైట్స్ ను టీజర్ రూపంలో విడుదల చేయడంతో ఈ ఆడియో వేడుకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇండియా నుంచి వచ్చే కొందరు సినీ ప్రముఖులకు దుబాయ్కి ప్రత్యేకంగా విమానాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేదికపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తుండటం మరో విశేషం.అయితే ఈ ఆడియో లాంచ్కు సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వార్తల్లోకి వచ్చింది. దీనికి అతిథిగా ఓ స్టార్ హీరోను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. విశ్వనటుడు కమల్ హాసన్. ఆయన చేతుల మీదుగా 2.0 పాటలు విడుదల కానున్నాయని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
‘భారతీయుడు’ తర్వాత కమల్ హాసన్.. శంకర్ తో మరోసారి జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ భారతీయుడు సీక్వెల్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే శంకర్ అడగ్గానే కమల్ ఈ ఆడియో వేడుకకు రావడానికి అంగీకరించారట. డిసెంబర్లో రోబో 2.0 చిత్రానికి సంబంధించిన టీజర్ను నవంబర్లో, ట్రైలర్ను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రోబో 2.0ను 2018 జనవరి 25న రిలీజ్ చేయనున్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్లో సాంకేతిక అంశాలను జోడించిన చిత్రంగా రోబో 2.0 ఓ ప్రత్యేకతను సంతరించుకొన్నది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa