చలసాని అశ్విని దత్ యాజమాన్యంలోని ప్రఖ్యాత టాలీవుడ్ ప్రొడక్షన్ బ్యానర్ అయిన వైజయంతీ మూవీస్ ప్రస్తుతం ప్రభాస్ మరియు దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన వారి అత్యంత భారీ ప్రాజెక్ట్ 'కల్కి 2898 AD' విడుదలపై దృష్టి సారించింది. తాజా అప్డేట్ ప్రకారం, వైజయంతీ మూవీస్ ప్రముఖ మరియు టాలెంటెడ్ దర్శకుడు పవన్ సాదినేనితో తమ తదుపరి ప్రాజెక్ట్ ని చేయనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి 2898 AD విడుదలైన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ కొత్త ప్రాజెక్ట్కి దుల్కర్ సల్మాన్ ముఖ్యపాత్ర పోషిస్తారని లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa