కన్నడ సోయగం రష్మి్క మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉందని తెలిసిందే. కాగా ఈ భామకు సెక్యూరిటీ పెంచారన్న వార్త ఒకటి ఇప్పుడు అటు బీటౌన్, ఇటు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.ఇంతకీ రష్మిక మందన్నాకు సెక్యూరిటీ పెంచడమేంటనుకుంటున్నారా..? దీనిక్కారణం సల్మాన్ ఖాన్ (Salman Khan)తో సినిమా చేస్తుండటమే.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు మెసేజ్తో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ ఇంటిదగ్గర భద్రతను పటిష్టం చేశారని తెలిసిందే. ఖాన్ సెక్యూరిటీ టీం, పోలీసుల బృందం భద్రతా చర్యలను పర్యవేక్షిస్తుంది. కాగా సెక్యూరిటీ మధ్యే సల్మాన్ ఖాన్ షూటింగ్స్కు హాజరవుతున్నాడు. సల్లూ భాయ్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న సికిందర్. రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్మికకు కూడా భద్రతను పెంచారట.. సికిందర్ సెట్స్లో అదనపు భద్రతా బలగాలను ఏర్పాటు చేసినట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా కాంబినేషన్లో వస్తోన్న తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.ఈ చిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. సికిందర్ ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa