బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్ఠాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో 'రామాయణ'గా ఇది రానుంది.ఇందులోని నటీనటులుగా ఎవరు కనిపించనున్నారనేది ఎప్పుడూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగానే ఉంది. ఇప్పటికే రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ఇందులో అధికారికంగా భాగమయ్యారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీదేవోల్ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు. ఈవిషయాన్ని తెలుపుతూ ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని సన్నీ హామీ ఇచ్చారు.''అవతార్', 'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' తరహాలో రామాయణ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా పెద్ద ప్రాజెక్ట్గా ఇది తెరకెక్కుతుంది. అద్భుతమైన విజువల్స్తో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు. వీఎఫ్ఎక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. అందరూ దీన్ని ఇష్టపడతారు' అని చెప్పారు. అయితే తాను ఏ పాత్రలో కనిపిస్తాననే విషయం మాత్రం ఇప్పుడే చెప్పనని సన్నీదేవోల్ అన్నారు. ఆయన హనుమంతుడి పాత్రలో కనిపించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాపై రణ్బీర్ కపూర్ మాట్లాడారు. ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి పార్ట్కు సంబంధించి తన పాత్ర షూటింగ్ పూర్తయినట్లు చెప్పారు. త్వరలోనే రెండో భాగాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఇక ఇందులో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్ కనిపించనున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్సింగ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక దీని వీఎఫ్ఎక్స్ కోసం నితేశ్ తివారీ టీమ్ ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్ఈజీ (DNEG)తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ చిత్రం మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa