ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 21, 2024, 11:39 AM

అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్‌కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.అనంతరం తెలంగాణ భవన్​లో యుగంధర్ గౌడ్ మాట్లాడారు. ‘‘అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అభిమానులను కంట్రోల్ చేయలేమని పోలీసులు హెచ్చరించినా పట్టించుకోలేదు. అల్లు అర్జున్ నిర్లక్ష్యంగానే ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావుబతుకుల మధ్య ఉన్నాడు’’అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa