‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అనంతరం తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడాలు వంటి వెసులుబాటు ఉండదని ఖరాఖండీగా ప్రకటించింది. సంక్రాంతికి వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమాకు టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించినా.. కోర్టు కలగజేసుకోవడంతో.. వెంటనే టికెట్ల ధరలను తగ్గించారు. దీంతో చిన్న సినిమాలకు ఏమోగానీ.. భారీ బడ్జెట్తో రూపొందే సినిమాలకు మాత్రం అంతే భారీగా ఇబ్బంది నెలకొంది. ఇదిలా ఉంటే.. తాజాగా హైకోర్టు.. ఫ్యామిలీ ఆడియన్స్కు, థియేటర్ సినిమాలకు మరో భారీ షాక్ ఇచ్చింది.
ఆ షాక్ ఏంటంటే..ఇకపై థియేటర్స్లో పిల్లలు సినిమా చూడాలంటే నిర్దిష్ట సమయంలో మాత్రమే చూడాలనేలా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తరువాత 16 ఏళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్లకు హైకోర్టు తెలిపింది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ టిక్కెట్ ధరల పెంపును, అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 4 పిటిషన్లపై విచారణ చేపట్టగా.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ హైకోర్టు గత ఉత్తర్వుల మేరకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పునః సమీక్షించి, ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతించరాదని నిర్ణయం తీసుకుంటూ జనవరి 11న ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రజా ప్రయోజనాలు, ఆరోగ్యం, రక్షణలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదనేలా నిర్ణయం తీసుకుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa