బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. ఇబ్రహీం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు అగ్ర దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్. సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ పెడుతూ.. ఇబ్రహీంని బాలీవుడ్కి పరిచయం చేయబోతున్నాను అంటూ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు.12 ఏండ్ల క్రితం ఇబ్రహీం అలీఖాన్ తల్లి అమృత (సైఫ్ అలీఖాన్ మొదటి భార్య)ని మొదటి సారి నేను కలిశాను. తనను డింగి అని పిలవడం నాకు అలవాటు. అమృత మా నాన్నతో కలిసి ధర్మ ప్రోడక్షన్స్లో ‘దునియా’ అనే సినిమా చేసింది. ఈ సినిమా తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తనతో కలిసి చైనీస్ డిన్నర్ చేయడం.. జేమ్స్ బాండ్ సినిమా చూడడం.. ఇప్పటికి మర్చిపోలేను. మేము కలిసిన సెకండ్ టైంలోనే నన్ను స్వంత మనిషిలా చూసుకుంది. సైఫ్ని నేను మొదటిసారి ఆనంద్ మహింద్రా ఆఫీస్లో కలిశాను. ఆ తర్వాత ఈ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఏర్పడింది. సినిమా అనేది వీరి రక్తంలోనే ఉంది. త్వరలోనే మీ ముందుకు ఇబ్రహీం అలీఖాన్ని పరిచయం చేయబోతున్నాను. అప్పటివరకు వెయిట్ చేయండి అంటూ కరణ్ జోహర్ రాసుకోచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa