యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ వంటి బంపర్ హిట్ తర్వాత డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. గురువారం ఈ మూవీ తమిళ ట్రైలర్ను చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ముఖ్య అతిథిగా హాజరై.. తమిళ ట్రైలర్ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంంలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, డైరెక్టర్ వెంకట్ ప్రభు వంటి వారు అతిథులుగా హాజరవగా.. తమిళ్లో ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.ట్రైలర్ విడుదల అనంతరం హీరో కార్తి మాట్లాడుతూ.. ‘‘నన్ను టాలీవుడ్లో ఎంతో గొప్పగా ఆదరించారు. తెలుగు ప్రేక్షకుల గొప్ప ప్రేమ నాకు దొరికింది. ‘తండేల్’ మూవీ 2018లో జరిగిన రియల్ స్టోరీ అని తెలిసి ఆశ్చర్యపోయాను. మన జాలర్లు పాకిస్థాన్కు వెళ్లి అక్కడి వారికి దొరికిపోవటం, అక్కడి నుంచి తప్పించుకుని రావటం లాంటి డ్రామాతో పాటు చక్కటి ప్రేమ కథతో ఈ మూవీని తెరకెక్కించారు. 20 మంది దగ్గర రైట్స్ తీసుకుని, మూడేళ్లు స్క్రిప్ట్ తయారు చేసి, ఏడాదిన్నర పాటు షూటింగ్ చేశారంటే ఆ సినిమా అంటే వాళ్లకెంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు చందూ మొండేటి కెరీర్లో చాలా హిట్ మూవీస్ చేశారు. ఈ సినిమా కూడా ఆయన హిట్ మూవీస్లో ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa