మమతా కులకర్ణి అలియాస్ ‘మాయీ మమతానంద్ గిరి’ని అఖాడా బహిష్కరించింది. తాజాగా జరుగుతున్న కుంభమేళాలో మాజీ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసినిగా మారిన విషయం తెలిసిందే. తాజాగా జరుగుతున్న కుంభమేళాలో మాజీ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి, సన్యాసినిగా మారిన విషయం తెలిసిందే. ఆమె కిన్నెర అఖాడాలో మహామండలేశ్వర్గా దీక్షా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు మత పెద్దలు, అఖాడాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాజాగా ఆమెను కిన్నెర అఖాడా నుండి బహిష్కరించారు. అలాగే ఆమెను అఖాడాలో చేర్పించిన గురువుపై కూడా బహిష్కరణ విధించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..కుంభమేళా ప్రారంభంలో ఆమెను లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి కిన్నెర అఖాడాలో చేర్చుకుంటూ అఖాడాలో అత్యున్నత స్థానమైన మహామండలేశ్వర్ హోదాను ఇచ్చారు. అలాగే ఆమె పేరును ‘మాయీ మమతానంద్ గిరి’గా మార్చారు. ఈ నేపథ్యంలోనే పలువురు అఖాడాలు ఆరంభంలోనే ఆమెకు అంతా గొప్ప హోదా ఎలా ఇస్తారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా కూడా 'మహా కుంభమేళా పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం, కానీ కొందరు వ్యక్తులు ఇందులో అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయిన వ్యక్తులు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోయి.. మహామండలేశ్వర్ వంటి బిరుదులను కూడా పొందుతున్నారంటూ' ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే అఖాడా వ్యవస్థాపకులు అజయ్ దాస్.. మమతా కులకర్ణితో పాటు గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కూడా కిన్నెర అఖాడా నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు.ఈ నేపథ్యంలోనే లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. అజయ్ దాస్ అఖాడా నుండి బయటకు వెళ్లి, కుటుంబంతో నివసిస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఎలాంటి నిర్ణయం తీసుకునే హక్కు లేదని తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa