ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సహాయం చేసిన వారిపై కేసులు పెట్టాలని ఎలా అనిపించింది

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 08:07 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన జానీ మాస్టర్ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయినా ఇరు వర్గాలు కోర్టు బయటే ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల జానీ మాస్టర్ తన భార్య సుమలత అలియాస్ అయేషాతో కలిసి ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అనంతరం సదరు బాధితురాలు కూడా మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్, ఆయన వాదనలను తీవ్రంగా కొట్టి పడేశారు. తాజాగా మరోసారి బాధితురాలి కామెంట్స్ పై జానీ మాస్టర్ వైఫ్ అయేషా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాధితురాలు మాట్లాడుతూ.. 'జానీ మాస్టర్ నన్ను ఇండస్ట్రీకి తీసుకురాలేదు. నేను స్వశక్తితో పైకొచ్చాను. . జానీ మాస్టర్ కు క్యారెక్టర్‌లెస్' అంటూ తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ భార్య కౌంటర్ ఇస్తూ.. " నా భర్తపై నువ్వు మనసు పడ్డావ్, అందుకే నిన్ను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తొలిగించాం. ఆరేళ్లు నా భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె చెబుతోంది. రెండేళ్లుగా జానీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఆమెను మేం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా తొలిగించి, దూరం పెట్టాం. అలాంటిది ఇప్పుడామె జానీపై ఫిర్యాదు చేయడం ఏంటి? ఆమె ఉద్దేశం ఏంటో ఇక్కడే తెలిసిపోతోంది కదా. కేవలం నా భర్తను ఇబ్బంది పెట్టడం కోసమే ఆమె ఇలా వ్యవహరిస్తోంది. లైంగిక వేధింపులు చేశాడనేది పూర్తిగా అవాస్తవం. శ్రేష్టికి అసోసియేషన్ లో సభ్యత్వం ఇప్పించి, ఆమె చెల్లెలి చదువు కోసం కూడా సహాయం చేసిన జానీ మాస్టర్ పై కేసు పెట్టాలని ఆమెకు ఎలా అనిపించిందని" అంటూ ప్రశ్నిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa