ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రిష్‌4’పై దర్శకుడు కామెంట్స్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2025, 04:22 PM

హృతిక్‌ రోషన్‌ హీరోగా తెరకెక్కిన ‘క్రిష్‌’ సిరీస్‌ సినిమాలు మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పటికే విడుదలైన మూడు భాగాలు భారీ విజయాన్ని అందుకోగా నాలుగో భాగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీని ఆలస్యానికి కారణాన్ని తాజాగా దర్శకుడు రాకేష్‌ రోషన్‌  వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ చిత్రాన్ని 12 ఏళ్ల నుంచి తెరకెక్కించలేకపోతున్నట్లు చెప్పారు.‘‘క్రిష్‌ 4’  కోసం ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ, మేము ఎంత ప్రయత్నించినా బడ్జెట్‌ సమకూరడం లేదు. అందుకే ఇది ఆలస్యమవుతోంది. నాలుగో భాగాన్ని మరింత గ్రాండ్‌గా తీయాలి. ఒకవేళ నేను బడ్జెట్‌ తగ్గించాలని చూస్తే.. ఈ చిత్రం ఓ సాధారణ కథలా అయిపోతుంది. అంతేకాదు.. ప్రస్తుతం ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది. అరచేతిలో ఉండే సెల్‌ఫోన్‌లో మొత్తం తెలిసిపోతోంది. ఈ రోజుల్లో పిల్లలు కూడా ఎంతోమంది సూపర్‌హీరోల చిత్రాలను చూస్తున్నారు. అలాంటప్పుడు మనం చిన్న తప్పు చేసినా వారి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మరింత జాగ్రత్తగా దీన్ని తీయాలి. హాలీవుడ్‌లో సూపర్‌ హీరో డ్రామాలు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తారు. అది మనకు సాధ్యం కాదు. అంత ఖర్చులు భరించలేం. వారు రూ.1000తో సినిమా తీస్తే.. మనం అదే సినిమాను రూ.4కు తీయాలి. నిర్మాతలు బడ్జెట్‌పై కాకుండా మంచి కథలపై దృష్టి పెట్టాలి’’ అని దర్శకుడు రాకేష్‌ రోషన్‌ చెప్పారు. ఇక క్రిష్‌ సిరీస్‌ చిత్రాలు వరుసగా 2003, 2006, 2013 సంవత్సరాల్లో విడుదలైన విషయం తెలిసిందే.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa