నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా మలయాళ ఇండస్ట్రీలో ఒత్తిడి గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో మోహన్లాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లూసిఫర్2: ఎంపురాన్’. ఈ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న పృథ్వీరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మలయాళ ఇండస్ట్రీకు బాక్సాఫీసు నంబర్లు ఎంతో ముఖ్యమన్నారు.‘‘మలయాళంలో సినిమాలకు లాభాలు రావడానికి చాలా ఒత్తిడి ఉంటుంది. అంత ఒత్తిడి ఉన్నప్పటికీ పరిశ్రమ గొప్ప సినిమాలను అందిస్తోంది. మంచి కథలు కాకపోతే కచ్చితంగా ఆదరణకు నోచుకోవని ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. ఈ విషయంలో వాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలి. గతకొంత కాలంగా నటీనటులు ఎవరు? దర్శకుడు ఎవరు? అనే దానితో సంబంధం లేకుండా మంచి సినిమాలు భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. మేము విజయం సాధించామనడానికి ఇదే నిదర్శనం. కథ బాగుంటే హీరో ఎవరనేదానితో సంబంధం లేకుండా సినిమాలు హిట్ అవుతాయి. మంచి కథను ఎంచుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం మాకు కలిగింది. మన పనికి మనం కట్టుబడి ఉంటే తర్వాత ఫలితాన్ని ఆడియన్స్ అందిస్తారు’’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పారుప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్2: ఎంపురాన్’ ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మోహన్లాల్ (Mohanlal) కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు ‘లూసిఫర్ 2: ఎంపురాన్ (రాజు కన్నా గొప్పవాడు)’ పేరిట ప్రీక్వెల్ కమ్ సీక్వెల్ను రూపొందించారు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa