బాలీవుడ్ లో రైజింగ్ స్టార్ గా వెలిగిపోతున్న నటుడు వరుణ్ ధావన్ తన గాళ్ ఫ్రెండ్ నటాషా దలాళ్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ జంట పెళ్లి గోవాలో జరగనుందని.. ముంబైలో ఘనంగా రిసెప్షన్ ఉంటుందని గతంలో ప్రచారమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. వెన్యూ తో పాటు పెళ్లి తేదీ మారిందట. వరుణ్ – నటాషా జంట పెళ్లి 2020లో ఉంటుంది. జోధ్ పూర్ ఉమైద్ భవన్ ప్యాలెస్ లో ఈ వివాహం జరగనుంది. ఉమైద్ భవన్ అనగానే ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ (నిక్యాంక జోడీ) మూడు రోజుల పెళ్లి గుర్తుకు రావాల్సిందే. ఈ జంట భారీగా బంధుమిత్రుల సమక్షంలో ఇరువురి సాంప్రదాయాల్లో పెళ్లాడుకున్నారు. అదే తరహాలో ఘనంగా వరుణ్ ధావన్ తన ప్రియురాలిని పెళ్లాడబోతున్నాడట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa