ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత సైన్యానికి విరాళం ప్రకటించిన అల్లు అరవింద్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 11:56 AM

భారత్ సైన్యానికి అండగా తెలుగు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విరాళం ప్రకటించారు. శ్రీవిష్ణు నటించిన 'సింగల్' మూవీ కలెక్షన్స్‌లో కొంతభాగాన్ని భారత్ సైన్యానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇందులో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ రాజ్ డైరెక్షన్ వహించాడు.మన సైనికులు దేశం కోసం పోరాడుతుంటే.. సినిమా విషయంలో మేం సెలబ్రేషన్స్‌ చేసుకోవడం సరికాదు అనిపించింది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టాం. ఈ ఉద్రిక్త పరిస్థితులకు ముందు మేం ఈ మూవీ రిలీజ్ డేట్‌ ప్రకటించాం. వాయిదా వేయడం మంచిదా, కాదా? అన్న దానిపై చర్చించాం. సినిమా కోసం వందల మంది పనిచేయడమే కాదు థియేటర్లపై వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎవరూ తప్పుగా అర్థంచేసుకోరనే ధైర్యంతో సినిమాని విడుదల చేశాం’’ అని అరవింద్‌ వివరణ ఇచ్చారు. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ చిత్రమిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa