ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నారు

cinema |  Suryaa Desk  | Published : Sun, May 11, 2025, 06:20 AM

ప్రముఖ నటుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన తన మైనపు విగ్రహాన్ని నేడు ఆవిష్కరించారు. ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ నటుడిగా చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా పాలుపంచుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం సంపాదించడం అనేది ఏ సెలబ్రిటీకైనా అరుదైన గౌరవంగా భావిస్తారు. తాజాగా ఈ గౌరవం రామ్ చరణ్‌కు దక్కింది. లండన్‌లో ఏర్పాటు చేసిన తన మైనపు ప్రతిమను రామ్ చరణ్ స్వయంగా ఆవిష్కరించారు.ఈ మైనపు విగ్రహంలో ఒక ప్రత్యేకత ఉంది. రామ్ చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం 'రైమ్' ప్రతిరూపాన్ని కూడా మ్యూజియం నిర్వాహకులు తీర్చిదిద్దారు. చరణ్ తన పెంపుడు కుక్కతో కలిసి వేదికపైకి వెళ్లి, సోఫాలో ఆసీనులైనట్లుగా ఉన్న తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇప్పటికే ఈ మ్యూజియంలో టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్‌ల మైనపు విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో చేరడంతో, తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa