బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మరియు రితేష్ దేశముఖ్ ప్రధాన పాత్రలో నటించిన 'రైడ్ 2' చిత్రం మే 1, 2025న విడుదల అయ్యింది. ఈ సినిమా మిశ్రమ సమీక్షలతో బాక్స్ఆఫీస్ వద్ద ప్రారంభమైంది. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా ఇండియా వైడ్ గా 112.42 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో వాని కపూర్, రాజత్ కపూర్, సౌరభ్ శుక్లా కీలక పాత్రలలో నటించారు మరియు తమన్నా భాటియా ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. పనోరమా స్టూడియోస్ మరియు టి-సిరీస్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2018 హిట్ రైడ్ కు సీక్వెల్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa