పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఓజీ’ ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాదులో పునఃప్రారంభమైంది. ప్రముఖ నటి శ్రియా రెడ్డి కూడా ‘ఓజీ’ షూటింగ్లో పాలుపంచుకున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో ఆమె నేడు పాల్గొన్నారు.సెట్స్లోకి తిరిగి రావడం పట్ల శ్రియా రెడ్డి తన సంతోషాన్ని, ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు సుజీత్ మరియు చిత్ర బృందంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. "మరోసారి ఓజీ సెట్స్లోకి వచ్చేశాను. సుజీత్ అండ్ గ్యాంగ్ఇలా ఉత్తమ బృందంతో పనిచేస్తున్నా. ఇక ఆయనతో పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. ఇంత డెప్త్ ఉన్న పాత్రను పోషిస్తున్నందుకు నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని శ్రియా రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ‘సలార్’ చిత్రంలో రాధా రమ పాత్రలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందిన శ్రియా రెడ్డి, ‘ఓజీ’లో కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.హైదరాబాద్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, "హైదరాబాద్ నాకు ఎప్పుడూ రెండో ఇల్లు లాంటిదే. నా ఆత్మీయ స్నేహితుల్లో చాలామంది ఇక్కడి వారే. నేను పెద్దగా ఫుడీని కాకపోయినా, ఇక్కడి కొన్ని రుచులు నాకు ఇష్టం. కొత్తగా ప్రారంభమైన రెస్టారెంట్లలోకి వెళ్ళడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని ఆమె తెలిపారు.‘ఓజీ’ చిత్రం స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో కూడిన కథనంతో రూపొందుతుండటంతో ప్రేక్షకులు, అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తుండటం, భారీ తారాగణం మరియు సుజీత్ విలక్షణమైన మేకింగ్ స్టైల్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. విభిన్నమైన విజువల్స్, ఉత్కంఠభరితమైన కథనాలతో పేరుపొందిన సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’, ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.ప్రస్తుతం చిత్ర యూనిట్ హైదరాబాద్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. రాబోయే రోజుల్లో ‘ఓజీ’ ప్రపంచం నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్లు వెలువడే అవకాశం ఉందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa