ప్రముఖ నటి తమన్నా ఇటీవలే ఆధ్యాత్మిక థ్రిల్లర్ 'ఒడెలా 2' తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా ఇప్పుడు 'వీవన్' తో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించారు మరియు అరుణబ్ కుమార్ మరియు దీపక్ మిశ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. ఈ చిత్రం 15 మే 2026న విడుదల కానున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ థ్రిల్లర్లో సిద్ధార్థ్ మరియు తమన్నా తమ పాత్రలకు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఎక్తా ఆర్ కపూర్ యొక్క బాలాజీ టెలిఫిల్మ్స్ టివిఎఫ్ సహకారంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా బ్యాంక్రోలింగ్ చేస్తోంది. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ జూన్ 2025 నుండి ప్రారంభమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa