ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'OG' షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన ఇమ్రాన్ హష్మి... కారణం ఏమిటంటే...

cinema |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 07:39 PM

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'OG' షూట్ ఇటీవల సుదీర్ఘ విరామం తర్వాత షూటింగ్‌ను తిరిగి ప్రారంభించింది. పవన్ ఇప్పుడు ముంబై షూట్‌లో పాల్గొన్నాడు. ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ మరియు విల్లన్ ఇమ్రాన్ హష్మి మధ్య ఫేస్-ఆఫ్ సన్నివేశాలను చిత్రీకరించాలని మేకర్స్ ప్రణాళిక వేశారు. అయితే బాలీవుడ్ నటుడు డెంగ్యూతో బాధపడుతున్న తరువాత తాత్కాలికంగా షూట్ ఆపవలిసి వచ్చింది. OG మేకర్స్ బాలీవుడ్ నటుడిని మొదట అతని ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరినట్లు తెలిసింది. ఇమ్రాన్ హష్మి ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు టాక్ మరియు అతను ఎప్పుడు షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ జాపనీస్ నటుడు కాజుకి కీటమురా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa