ట్రెండింగ్
Epaper    English    தமிழ்

$100K మార్క్ కి చేరుకున్న 'భైరవం' USA ప్రీమియర్ గ్రాస్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 02:39 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్‌ 'భైరవం' పేరుతో మే 30న విడుదల అయ్యింది. ఈ సినిమాకి పాజిటివ్ స్పందన లభిస్తుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాని ఓవర్సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్  బ్యానర్ పై విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క USA ప్రీమియర్ గ్రాస్ $100K మార్క్ కి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళై, ఆనంది కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa