ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రం 'హరిహర వీరమల్లు' విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం తాను తీసుకున్న పారితోషికాన్ని నిర్మాత ఏఎం రత్నంకు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా, మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సినిమా నిర్మాణంలో జాప్యం, నిర్మాతపై పడిన ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.'హరిహర వీరమల్లు' చిత్రం 2020లో అధికారికంగా ప్రారంభమైంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కొంత భాగం చిత్రీకరణ జరుపుకుంది. అయితే, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం, అనంతరం జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించి, ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. ప్రజా సేవకే తొలి ప్రాధాన్యం ఇస్తున్న ఆయన, షూటింగ్కు పూర్తి సమయం కేటాయించలేకపోయారు. ఈ క్రమంలో, సినిమా పూర్తి చేసే బాధ్యతను ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ తీసుకుని, మిగిలిన భాగాన్ని ఇటీవలే పూర్తి చేశారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa